ఇక నుంచి తీన్మార్ మల్లన్నలో కొత్త యాంగిల్‌ చూస్తారు – తీన్మార్‌ మల్లన్న

-

ఇక నుంచి తీన్మార్ మల్లన్నలో కొత్త యాంగిల్‌ చూస్తారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఉమ్మడి వరంగల్ ,ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న( చింతపండు నవీన్ కుమార్). అనంతరం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తో ఫోటో సెషన్లో పాల్గొన్నారు మల్లన్న.

teenmar mallanna

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ, బాలుమురి వెంకట్,పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ…. శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం నా జీవితంలో మొదటి అవకాశం అన్నారు. ఇంత కు ముందు నేను వార్డు మెంబర్ గా కూడా గెలవలేదని… ఇంతకు ముందు తీన్మార్ మల్లన్న వేరు,ఇప్పుడు ఉన్న తీన్మార్ మల్లన్న వేరన్నారు. ఇప్పటి నుండి భాద్యత గల వ్యక్తి గా నడుచుకుంటానని.. పట్టభద్రుడిగా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్సీ,మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇండియా కూటమి సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పారు. నా గెలుపు ను భుజాల మీద వేసుకున్న నా టీం కు ఎల్లప్పుడూ రుణాలు పడి ఉంటానని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news