తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ అధ్యక్షతన నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకున్నారట.

ఉగాది నుంచి భూభారతి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్.