తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని.. ఆ దిశగా వెళుతున్నట్లు పేర్కొన్నారు.

అందుకు వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ -1987 కు సవరణలు చేసినట్లు క్లారిటీ ఇచ్చారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది: మంత్రి పొంగులేటి pic.twitter.com/v4Q1cMgCKc
— BIG TV Breaking News (@bigtvtelugu) March 7, 2025