రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

-

తెలంగాణలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రేపటి నుంచి ప్రచారం మరింత ఊపందుకోనుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నోటిఫికేషన్‌కు గవర్నర్ తమిళిసై ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్ జారీ చేస్తారు. తర్వాత 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఈనెల10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 13న నామపత్రాల పరిశీలన చేపట్టనండగా… ఈనెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈనెల 30న పొలింగ్‌ నిర్వహించి వచ్చేనెల 3న ఓట్లలెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

మరోవైపు శుక్రవారం నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 60 మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న IRSలను పరిశీలకులుగా నియమించగా శుక్రవారం నుంచి విధుల్లో ఉంటారు. వారికి సహాయకంగా ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతోపాటు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు. 39 మంది IPS అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను వారు పర్యవేక్షిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version