తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణికి తీవ్ర అస్వస్థత !

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ఊహించని షాక్ తగిలింది. సీఎం కేసీఆర్ సతీమణి శోభ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోంది. దీంతో సీఎం కేసీఆర్ సతీమణి శోభాను కుటుంబ సభ్యులు… సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.

గురువారం అర్ధరాత్రి నుంచి జ్వరం మరియు ఒళ్ళు నొప్పులతో బాధపడుతుండటంతో ఆసుపత్రిలో చేరాల్సిందిగా సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎంవీ రావు సూచించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ సతీమణి శోభాను సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి పై వివరాలు కూడా తెలుసుకున్నారు. ఇక ప్రస్తుతం శోభ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news