కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే 50 వేలు కట్టాల్సిందే !

-

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన నుంచి రేవంత్‌ రెడ్డి ఏం మాట్లాడినా వివాదమే అవుతుంది. ఆయన ఏది చేసినా.. విమర్శలు పాలు అవుతున్నారు. అయితే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారా ? అయితే 50 వేలు కట్టి దరఖాస్తు చేసుకోండని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం.

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 18 నుంచి 25 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని పేర్కొందట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఓసీ అభ్యర్థులైతే రూ.50 వేలు, బీసీలైతే రూ.25 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించిందట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version