కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్యాసం తీసుకుంటే బెటర్‌ – గుత్తా సుఖేందర్ రెడ్డి

-

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్యాసం తీసుకుంటే బెటర్‌ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్లగొండ జిల్లాలో….మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ….పదవులు ఆశించే వాళ్లంతా వివిధ పార్టీల వైపు చూస్తున్నారు….ఆశావాహులకు అస్సలు ఓపిక లేకుండాపోయిందని వెల్లడించారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలో హై కమాండ్ నిర్ణయం ఎలా ఉన్నా… నా పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటే… ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం ఉండదని వివరించారు. మా వియ్యంకుడు మొదటి నుంచి కాంట్రాక్టర్ అని.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు అర్దరహితమని మండిపడ్డారు.

కోమటిరెడ్డి సన్యాసం పుచ్చుకుంటే బెటర్…సీనియర్ అని చెప్పుకునే కోమటిరెడ్డికి మెచురిటి లేదని విమర్శలు చేశారు. గాలి మాటలతో ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారు….కాంగ్రెస్ నేతల్లోనే ఐక్యత లేదు… ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు…. వీళ్ళా ప్రజల బాగోగుల గురించి మాట్లాడేదంటూ విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version