రేవంత్ రెడ్డి 39వ ఢిల్లీ పర్యటన రద్దు అయింది. ఢిల్లీకి ఎవరూ రావద్దని హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. ఫోన్ ద్వారా సమాచారం ఇస్తామని స్పష్టం చేసిన అధిష్టానం… ఢిల్లీకి ఎవరూ రావద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేకపోవడంతో పర్యటన రద్దు అయింది.

ఇక నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. ఇందులో భాగంగానే.. ఇవాళ ఉదయం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్గౌడ్, మంత్రి ఉత్తమ్తో ఫోన్లో మాట్లాడనున్నారు కేసీ వేణుగోపాల్.