తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు.. కొత్త వేరియంట్‌పై అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి

-

దేశవ్యాప్తంగా ఇటీవల కోవిడ్ కేస్‌లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేరళలో ప్రస్తుతం 1634 యాక్టివ్ కేస్‌లు ఉండగా… అందులో 111 కేసులు సోమవారం ఒక్కరోజే నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇక తెలంగాణాలోనూ 5 పాజిటివ్ కేసులు ఉన్నట్లు అధికారిక గణాంకాలు తెలిపాయి.

కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదని చెప్పారు.

ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news