‘పద్మశ్రీ’లకు రూ.25 లక్షల బహుమతి అందించిన సీఎం రేవంత్

-

తెలంగాణకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇచ్చి సత్కరించింది. పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్‌కు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 25 లక్షల రూపాయలు చెక్కును అందచేశారు. పద్మశ్రీ గ్రహీతలు రాష్ట్రానికి గర్వకారణమని రేవంత్‌ రెడ్డి అభినందించారు. చెక్కులు స్వీకరించిన గ్రహీతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కళాకారుల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. కవులు, కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు. భాష, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే పద్మశ్రీ అవార్డుల గ్రహీతల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని రేవంత్ అన్నారు. ఇది ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version