Telangana : ఏప్రిల్‌ 30న కొత్త సచివాలయం ప్రారంభం

-

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న కొత్త సెక్రటేరియట్ ప్రారంభం కానుంది. జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది.

ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయం పనులు పరిశీలించిన విషయం తెలిసిందే. పనుల పురోగతిపై అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సెక్రటేరియట్ పనులు తుదిదశకు చేరుకున్నాయని ఇంజినీర్లు కేసీఆర్​కు వివరించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.

మరోవైపు హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్ తీరాన నిర్మిస్తున్న 125అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవ తేదీని కూడా నిర్ణయించిన విషయం తెలిసిందే. గురువారం రోజున జరిగిన మంత్రి వర్గ సమావేశంలో అంబేడ్కర్‌ జయంతి అయిన ఏప్రిల్ 14న ఆవిష్కరించటంతోపాటు బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆలోగా పనులను పూర్తిచేసేలా అధికారులు నిమగ్నమయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version