అంజలి కేసులో ట్విస్ట్… చంపింది ఓ డీజే ఆపరేటర్…నిందితుని నుంచే డబ్బులు వసులు చేసారు !

-

ప్రేమ వ్యవహారం వద్దని చెప్పడంతోనే హత్య అని పేర్కొన్నారు డీసీపీ సురేష్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో జీడిమెట్లలో అంజలి హత్య సంచలనం సృష్టించింది. అంజలిని ఆమె కుమార్తె, బాయ్ ఫ్రెండ్ కలిసి చంపారు. దీనిపై డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడారు. తల్లి అంజలిని కూతురు, ప్రియుడు శివ, ఆయన తమ్ముడు చున్నీతో బిగించి చంపారని పేర్కొన్నారు. శివతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమకు దారితీసిందన్నారు.

ANJALI
ANJALI

జూన్ 23 సాయంత్రం ఘటన జరగ్గా.. 24 గంటల్లోనే కేసును ఛేదించామని పేర్కొన్నారు. నిందితుడు శివ డీజే ఆపరేటర్ అని వెల్లడించారు. హత్య చేసినవారు దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తున్నారని వివరించారు డీసీపీ సురేష్ కుమార్. మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగ్గా చూసుకోలేదని.. చిన్న కూతురుని మాత్రం బాగా చూసుకుంటుందని ఏడో తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజులు హాస్టల్ లోనే యువతి ఉందట. నిందితుడు శివ నుంచి తల్లి అంజలి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు బయటపెట్టారు డీసీపీ సురేష్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news