ఏలూరు జిల్లాలో కత్తులతో వైసిపి కార్యకర్తలపై దాడి…!

-

 

ఏలూరు జిల్లాలో కలకలం సృష్టించింది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం రాజుల కొట్టాడలో టీడీపీ నేతలు రెచ్చిపోయి ప్రవర్తించారు. వైసిపి కార్యకర్తలపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ విషయంలో వైసీపీ సర్పంచ్ జోక్యం ఉండకూడదు అంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల సర్పంచ్ కుటుంబంపై రెండు సార్లు దాడి చేసినట్టుగా సమాచారం అందుతుంది. నిన్న మరోసారి సర్పంచ్ కుటుంబంపై దాడి చేశారని సర్పంచ్ కుటుంబం సభ్యులు ఆరోపించారు.

సర్పంచ్ కుటుంబంపై దాడి చేస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ వైసిపి నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news