శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ RTC గుడ్ న్యూస్

-

శ్రీశైలం వెళ్లే భక్తులకు తెలంగాణ RTC గుడ్ న్యూస్ చెప్పింది. APలోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తుల కోసం TSRTC స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రతి శనివారం ఉ. 7 గంటలకు JBS నుంచి సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభమై మధ్యాహ్నం 1:30కు శ్రీశైలం చేరుకుంటుంది.

ప్యాకేజీ ధర పెద్దలకు రూ. 2,700, పిల్లలకు రూ. 1570 ఉంటుంది. మల్లికార్జున స్వామి, భ్రమరాంబదేవి, సాక్షి గణపతి దర్శనంతో పాటు పాతాళ గంగ, పాలధార, శ్రీశైలం డ్యామ్ ను సందర్శించవచ్చు. తెలంగాణ ఆర్టీసీ టికెట్‌తో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతికి టిఎస్ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించేవారు తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని ఇప్పటికే సంస్థ చైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version