తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. మొదట పైలట్ ప్రాజెక్టుగా 47 కార్యాలయాలలో ఈ విధానాన్ని అమలు చేశామని చెప్పారు. ఈ సేవలపై ప్రజలు సంతృప్తి చెందడంతో పూర్తిస్థాయిలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పారు.

సందేహాల కొరకు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 8247623578 ఏఐ చాట్ బట్ తో అందుబాటులోకి తీసుకు వచ్చినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉండగా…. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఈరోజు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయనున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈరోజు గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 11వేల గ్రామాల్లో 40,000 మంది రైతులకు విత్తన కిట్లు అందించనున్నారు. వరి, కంది, మినుము, పెసర, జొన్న విత్తనాల కిట్లను అందించనున్నారు. దీంతో ప్రతి గ్రామాలలోని రైతులు సంతోషంలో ఉన్నారు.