తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలకు ఆస్తిలో వాటా ఇవ్వొద్దు !

-

 

తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో తెలంగాణ రాష్ట్ర హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తి కోసం తోడబుట్టిన వారితో కొట్లాడి ఏం సాధిస్తారు ? అని ప్రశ్నించింది హైకోర్టు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా కోరకుండా ఉండే చట్టం తెస్తే బాగుంటుందని పేర్కొంది హైకోర్టు.

44 గజాల స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన కుటుంబం, విచారణ సమయంలో కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు… ఆస్తి కోసం తోడబుట్టిన వారితో కొట్లాడి ఏం సాధిస్తారు ? అని ప్రశ్నించింది. 264 గజాల స్థలం కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు ఆరుగురు కుటుంబసభ్యులు (తల్లిదండ్రులతో కలిపి).

ఈ విచారణ సమయంలో ఒక్కో మనిషికి 44 గజాల స్థలం వస్తుందని, ఆ స్థలంలో ఇల్లు కూడా కట్టుకోలేరు కదా అని ప్రశ్నించారు జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి. మాకు అధికారం ఉండుంటే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం తెచ్చే వాళ్లమని అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news