రెండు రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. నేడు రేపు వర్షాలు

-

నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించారు. నైరుతి పవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతోపాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని, ఈ ప్రభావంతోనూ తెలంగాణలో వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ నెల 6వతేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ మేరకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతోపాటు హైదరాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఈదురు గాలులతో జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు. మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌ జిల్లాల్లో భారీ, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version