BRS ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

-

BREAKING: నర్సాపూర్ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది. మెదక్ జిల్లా శివంపేట (మం) గోమారం గ్రామంలో అర్ధరాత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిముందు ఉద్రిక్తత నెలకొంది. వినాయకుడి నిమజ్జన వేడుకలో సునీతా లక్ష్మా రెడ్డి ఇంటి ముందు టపాసులు పేల్చారు కాంగ్రెస్ కార్యకర్తలు.

Tension in front of Narsapur BRS Party MLA Sunitha Lakshmareddy’s house

దీంతో టపాసులు పేలుస్తుండగా అడ్డుకున్నారు BRS కార్యకర్తలు. ఈ తరుణంలోనే… కాంగ్రెస్, BRS కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగింది. ఈ ఘటన సమయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని సమాచారం. ముందు జాగ్రత్తగా QRT పోలీసులు ఉండటంతో రంగంలోకి దిగి ఇరు వర్గాలకు నచ్చజెప్పారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version