తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ షాక్ ఇచ్చింది ఆర్టీసీ సంస్థ. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బస్సు పాస్ ధరలను పెంచింది ఆర్టీసీ. బస్సు పాస్ ధరలను ఏకంగా 20 శాతం పెంచుతూ ఆదేశాలు దారి చేసింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం. సామాన్య ప్రజలతో పాటు స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచేసింది.

ఆర్డినరీ బస్సు పాస్ ధర 1150 రూపాయల నుంచి 1400 రూపాయలు తీసుకుంది. అలాగే మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను 1300 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు పెంచేసింది తెలంగాణ ఆర్టీసీ. మెట్రో డీలక్స్ పాస్ ధరలను 1450 రూపాయల నుంచి 1800 రూపాయలకు పెంచింది. పెరిగిన ధరలను నేటి నుంచి అమలు చేయబోతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఉచిత బస్సు పథకం వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రజల మీద భారం మోస్తోందని ప్రజలు ఫైర్ అవుతున్నారు.