పేదలకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు

-

పేదలకు నాణ్యమైన, మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతోనే  ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్
స్కూల్ సిస్టమ్ ని తీసుకొస్తోందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దాని కోసమే ఒక్కో ఇంటిగ్రేటెడ్
స్కూల్ ను రూ.250 నుంచి రూ.300 కోట్ల ఖర్చుతో నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టిందని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలో అడవి సోమన్ పల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్
శుక్రవారం నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పేదబిడ్డలకు సైతం మెరుగైన, నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్  డెవలప్మెంట్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో గత పదేళ్లలో ఆగిపోయిన అభివృద్ధిని తమ ప్రభుత్వం తిరిగి గాడిన పెడుతోందని, రాష్ట్రంలో మార్పు తీసుకొస్తోందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులకు రుణమాఫీ చేసి చూపించామని.. డీఎస్సీతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version