BREAKING : ఏడు పాయల అమ్మవారి ఆలయం మూసివేత

-

BREAKING : ఏడు పాయల అమ్మవారి ఆలయం మూసివేశారు ఆలయ అధికారులు. మెదక్ జిల్లాలో ఉన్నటు వంటి ఏడు పాయల అమ్మవారి ఆలయం మూసివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏడు పాయల అమ్మవారి ఆలయాన్ని మూసేశారు అధికారులు. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.

The Seven Payala Ammavari Temple is closed

కాగా, తెలంగాణ రాష్ట్రంలో గత రెండ్రోజులుగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరో రెండ్రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడినట్లు పేర్కొన్నారు. వీటి కారణంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version