Hyderabad: పెంపుడు కుక్కపై ముగ్గురు వ్యక్తులు దాడి !

-

హైదరాబాద్‌ లోని మధురానాగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. హస్కీ పెంపుడు కుక్కపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశౄరు. రహమత్ నగర్ లో నివసించే శ్రీనాథ్ తన ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ నెల 8వ తేదీన పొరపాటున బెల్టు ఉడదీసుకొని బయటకు వెళ్ళింది. దీనితో ఎదురుగా ఉన్న ధనుంజయ్.. శ్రీనాథ్ కుక్క యజమాని తో గొడవకు దిగారు. ఈ ఘటన పిఎస్ దాకా చేరింది. ఎలక్షన్ కారణంగా పోలీసులు అంతగా పట్టించుకోలేదు. ఇంట్లో ఎవ్వరు లేని సమయం గమనించిన ధనుంజయ్, ప్రవీణ్ మరో ముగ్గురు కలిసి కర్రలు రాడ్లతో కుక్కను విచక్షణ రహితంగా కొట్టారు.

అడ్డువచ్చిన శ్రీనాధ్, ఆయన భార్య స్వప్న ను సైతం తల పగులగొట్టారు. తీవ్రంగా గాయపడిన కుక్కను, దాన్ని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసులకు సమాచారం అందదాంతో ఘటనపై మధురానాగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడి సమయంలో సైతం హస్కి కుక్క తోక ఊపుతూ తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. అయినా అక్కసుతో యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news