తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత

-

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో, రాజకీయ నాయకుల కుటుంబాల్లో పలు విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ ఎంపీ జితేందర్ మాతృమూర్తి కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈశ్వరమ్మ ఈరోజు తుది శ్వాస విడిచారు. దీంతో బీజేపీ సీనియర్ నేత అయిన జితేందర్ రెడ్డి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాగా ఆమె మరణం పట్ల బీజేపీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందిస్తూ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ గారి మాతృమూర్తి ఈశ్వరమమ గారి మరణం చాలా బాధకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని ట్వీట్ చేశారు ఈటల రాజేందర్. అదేవిధంగా పలువురు బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి తల్లి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version