బ్రేకింగ్: తెరాస ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కరోనా

-

తెలంగాణా అధికార పార్టీ నేతలను ఇప్పుడు కరోనా వైరస్ బాగా వణికిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు తెరాస నేతలను బాగానే కంగారు పెడుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి కరోనా లక్షణాలు ఉండగా… ఆయనకు పరిక్షలు చేసారు. దీనితో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే తల్లి, సోదరుడు, పి ఏ , గన్ మెన్ లకు కుడా కరోన పాజిటివ్ నిర్దారణ అయింది.

ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది అని అధికారులు వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కరోనా బారిన పడ్డారు. డ్రైవర్ కు, ఇద్దరు గన్ మెన్లకూ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. ఆయన కుటుంబం హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version