నల్గొండ జిల్లాను షేక్ చేస్తున్న బ్రదర్స్ హత్య… ముగ్గుర్ని టార్గెట్ చేసి ఇద్దరినీ లేపెసారు…!

-

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. అనుముల మండలం హాజరు గూడెం గ్రామంలో జంట హత్యలు సంచలనంగా మారాయి. గ్రామానికి చెందిన అన్నదమ్ములు జానపాటి సత్యనారాయణ(38),జానపాటి అంజి(34) అనే ఇద్దరు వ్యక్తులను అత్యంత దారుణంగా… ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా గొడ్డళ్ళతో నరికి చంపారు కొందరు దుండగులు.సరిగ్గా ఏడాది క్రితం తమ చిన్న తమ్ముడు హరి భార్యతో అక్రమసంభంధం పెట్టుకున్న నేపథ్యంలో రేవంత్ అనే యువకుడు తిరుగుతున్నాడు అని చంపేశారు.

crime

ఆ కేసులో ఇటీవలే జైల్ కి వెళ్లి వచ్చారు అంజి, హరి, సత్యనారాయణ. ఈ దాడిలో మూడో సోదరుడు హరి పైనా దాడి జరిగింది. ఇద్దరు అన్నల హత్యలను చూసిన హరి తృటిలో తప్పించుకున్నాడు. వెంటనే సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ హత్యలతో జిల్లా మొత్తం షేక్ అయింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version