తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. సామాజిక స్పృహ వున్న కవయిత్రిగా, జర్నలిస్టు గా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్, శ్రీదేవి లు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.