సర్దార్ పటేల్ వల్లే.. తెలంగాణకు విముక్తి – అమిత్ షా

-

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ.. సర్దార్‌ పటేల్‌ లేకపోతే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేదని తెలిపారు. వేడుకలు నిర్వహించాలంటే ఇప్పటికీ కొందరు భయపడుతున్నారు.. ఏ భయం లేకుండా వేడుకలు చేసుకోవాలని కోరుతున్నానని పేర్కొన్నారు అమిత్‌ షా.

తెలంగాణ గడ్డపై జాతీయ జెండా ఎగరవేసేందుకు ఎందరో ప్రాణాలు అర్పించారని వెల్లడించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణలో స్వాంతంత్ర్య వేడుకలను గత ప్రభుత్వాలు జరపలేదని అన్నారు. 75 ఏళ్ల తర్వాత భాజపా ప్రభుత్వం సెప్టెంబర్‌ 17న వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version