Union Home Minister Amit Shah: తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. పసుపు బోర్డు కార్యాలయం లో ప్రదర్శనకు ఉంచిన పసుపు ఉత్పత్తులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరిశీలించారు.

అమిత్ షాతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి, అర్వింద్, బండి సంజయ్ కూడా ఉన్నారు. మరికాసేపట్లో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ… పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలోని పసుపు రైతులందరికీ అభినందనలు చెప్పారు అమిత్ షా.
జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎంపీ అరవింద్, పసుపు బోర్డు కార్యదర్శి భవాని శ్రీ, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క,… pic.twitter.com/pB3qRWY4D4
— BIG TV Breaking News (@bigtvtelugu) June 29, 2025