ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అన్నదాతా – సుఖీభవ పథకం కింద రైతులకు రూ. 20,000 అందించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన జారీ చేశారు. వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను జమ చేస్తుందని చెప్పాడు. అదే రోజున మనం కూడా అన్నదాతా – సుఖీభవ పథకం కింద డబ్బులను జమ చేస్తాం.
కేంద్రం మూడు విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి రైతుకు రూ. 20,000 అందించేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీంతో రైతులు సంతోషంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన అన్నదాతా – సుఖీభవ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.