ఉప్పల్ లో కరెంట్ వచ్చింది…హైదరాబాద్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా ?

-

 

ఐపిఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో నిన్న ఉప్పల్ స్టేడియంలో కరెంటు కట్ చేసింది విద్యుత్ శాఖ. కొన్ని నెలలుగా కరెంటు బిల్లులు కట్టలేదట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్.

Uppal Stadium is powered by electricity branch

అయితే ఇవాళ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కరెంట్ కట్ చేసింది విద్యుత్ శాఖ. అయితే మ్యాచ్ విషయాన్ని వారికి వివరించడంతో… ఆ బిల్లు కట్టేందుకు ఒక సమయం ఇచ్చారు అధికారులు. పెండింగ్ బకాయిల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఒకరోజు సమయం ఇచ్చింది విద్యుత్ శాఖ. దీంతో ఎప్పటిలాగే కరెంటు అక్కడ వచ్చింది. ఈ తరుణంలోనే హైదరాబాద్ వర్సెస్ చెన్నై మధ్య మ్యాచ్ యధావిధిగా జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news