త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటా – వేములవాడ ఎమ్మెల్యే

-

టికెట్‌ రాకపోవడంపై త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకుంటాంటూ వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు మెసేజ్ పెట్టాడు. టిక్కెట్టు ఖరారు కాలేదని బాధ పడకండి, సవాళ్లు వచ్చినప్పుడే ధీటుగా నిలబడాలని కోరారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. ఎన్నికల కోసం అభ్యర్ధులు వెను వెంటనే పుట్టరు, ప్రజాసేవ ద్వారా వారు ఈ అర్హతలు సంపాదించుకోవాలన్నారు. అందుకే అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయం, పార్టీ నేతల అభిప్రాయం అత్యంత కీలకం.

vemulawada ramesh babu

ఇది పాటించకుంటే మనోభావాలు దెబ్బతింటాయి, ప్రజల మన్నలను పొందలేమని చెప్పుకొచ్చారు. పౌరసత్వంపై అక్టోబర్ లో మనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి! ఆ సమస్య తీరితే మనకు ఆటంకాలు ఉండవని పేర్కొన్నారు. నియోజకవర్గ పలు సర్వేలకాధారంగా ఉత్తమంగా పనిచేసామన్న సి ఎం గారి వ్యాఖ్యలే మన దశాబ్ద కాలం నిస్వార్థ ప్రజా సేవకు నిదర్శనం అన్నారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. వేములవాడ నాకు ఎమ్మెల్యే పదవిచ్చె ఒక నియోజకవర్గం కాదు, ఈ ప్రాంత ప్రజల తో పెనవేసుకున్న సుధీర్ఘ రాజకీయ పేగుబంధం! ఇది ఊపిరున్నంత వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. వచ్చే రెండు మాసాల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కలిసికట్టుగా కృషి చేద్దాం!కలిసికట్టుగా భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుందామన్నారు. అక్టోబర్‌ లో తన పౌరసౌత్వంపై కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version