కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన విజయ్ దేవరకొండ

-

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొండా సురేఖ పై దుబాయ్ నుంచి కొంత వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారని వార్తలు వినిపించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ తరుణంలోనే కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రధానంగా నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం అని.. చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని సినిమా రంగం నుంచి తప్పుకోవడానికి కేటీఆరే కారణం అని ఆరోపించారు. అదేవిధంగా కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేశాడని పేర్కొంది. హీరోయిన్లతో కలిసి రేవ్ పార్టీలు చేసుకొని.. మదమెక్కి వారి జీవితాలతో ఆడుకున్నారని సంచలన ఆరోపణలు చేసింది కొండా సురేఖ. తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు విజయ్ దేవరకొండ. “నేటి రాజకీయ నాయకుల ప్రవర్తనపై నా ఆలోచనలు మరియు భావాలను మంచి భాషలో వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడుతున్నాను. ప్రజలకు మంచి జరగడానికి మేము ఓటు వేస్తామని చాలా మంది రాజకీయ నాయకులకు గుర్తు చేయాలనుకుంటున్నాము.ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేము..అంగీకరించలేము. రాజకీయాలు ఏ మాత్రం దిగజారకూడదు. ఇక చాలు” అంటూ స్పందించారు విజయ్ దేవరకొండ.

Read more RELATED
Recommended to you

Exit mobile version