ఈటలపై వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్‌..?

-

 

ఈటలపై వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్‌..ఇచ్చారా.. అంటే అవుననే అనాలి. తాజాగా విజయశాంతి చేసిన పోస్ట్‌.. ఈటల రాజేందర్‌ ను ఉద్దేశించి.. చేసినట్లేనని అర్థమౌవుతోంది. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల చేతులెత్తేశారు, చిట్ చాట్ లో ఈటల చెప్పారు, చేరికలు ఇక లేవు అంటున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు …..నాటి ఆ దుబ్బాక, జిహెచ్ఎంసి, నిన్నటి ఎమ్మెల్సీ ఫలితాలు చేరికలతో వచ్చాయా…! అంటూ ఫైర్‌ అయ్యారు రాములమ్మ.

vijayashanthi

చేరికల కమిటీతో వచ్చాయా..? ప్రజల విజ్ఞాన నిర్ణయంతో వచ్చాయా…! విశ్లేషించుకోవాలని చురకలు అంటించారు. బీజేపీని నిరంతరం గెలిపిస్తున్నది ప్రాణమిచ్చే కార్యకర్తల త్యాగాలు, బీజేపీని నమ్మే ప్రజల విశ్వాసాలు, రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలు మాత్రమేనన్నారు… చేరికల కమిటీ పేరు చెప్తూ, చిట్ చాట్ లను ప్రస్తావిస్తూ మీరు చేస్తున్న బీజేపీ వ్యతిరేక విమర్శల ప్రచారం ఎన్నటికి నిలవదన్నారు. ఇది హరీష్ రావు గారికి తెలవంది కాదని ఎద్దేవా చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version