పురోగతిలో పొరుగు తెలంగాణ…అధోగతిలో ఆంధ్రప్రదేశ్ – వైసీపీ ఎంపీ

-

పురోగతిలో పొరుగు తెలంగాణ…అధోగతిలో ఆంధ్రప్రదేశ్ ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విమర్శలు చేశారు. జగన్‌ 4 ఏళ్ల పాలనపై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని గొప్పలు పోవడం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే చెల్లిందని, అభివృద్ధి చేసి ఆదాయ వనరులను పెంచుకొని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు.

కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 1,80,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలను ఎవరు తీరుస్తారన్నది ప్రశ్నార్ధకమేనని, సాగునీటి రంగాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, కాలేశ్వరం వంటి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి రూపాయి సహకారం లేకపోయినప్పటికీ పూర్తి చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని, గత ప్రభుత్వ హయాంలో ఖర్చు చేసిన మొత్తంతో పోలిస్తే, ఈ ప్రభుత్వం సాగునీటి రంగం కోసం 40% కూడా ఖర్చు చేయలేదని, పోలవరం పూర్తి చేసి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలమై ఉండేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version