ORR పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం.. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్..!

-

ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే అమల్లోకి రానుంది ఈ గెజిట్ నోటిఫికేషన్. మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూర్, రాయలపూర్ గ్రామాలు… దమ్మాయిగూడా మున్సిపాలిటీలోకి కీసర, యదగిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి, చిర్యాల, నర్సంపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు రానున్నాయి. పోచారం మున్సిపాలిటీలోకి బోగారం, గోధుమకుంట, కరీంగూడా, రాంపల్లి దయరా, పోచారం మున్సిపాలిటీలోకి వెంకటాపూర్, ప్రతాప సింగారం, కొర్రెముల, కాచవానిసింగారం, చౌదరిగూడ చేరుతాయి.

అలాగే ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి అంకుశపూర్, ఔషాపూర్, మందారం, ఎదులాబాద్, ఘనపూర్, మఱిప్యాల్ గూడ, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోకి మునిరాబాద్, గౌడవెల్లి, తుంకుంట మున్సిపాలిటీలోకి బొంరాస్ పేట, శామిర్ పేట, బాబాగుడా గ్రామాలు వస్తాయి. అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్, ఐలాపూర్ తండా, కిష్టారెడ్డిపేట, పటేల్ గూడ, దాయర, సుల్తాన్పూర్ గ్రామాలు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోకి వస్తాయి. ఇక పటాన్చెరు మండల పరిధిలోని పాటి, కర్ధనూరు, ఘనపూర్, పోచారం, ముత్తంగి గ్రామాలు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోకి విలీనం కానున్నాయి. దీంతో మున్సిపల్ అధికారుల చేతుల్లోకి పంచాయతీల రికార్డులు వస్తాయి. ఈ విషయంలో డినోటిఫై చేస్తూ పంచాయతీరాజ్ శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news