తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ సంఘంటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లి గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) అనే యువకుడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి కారు మెకానిక్గా జీవనం కొనసాగిస్తున్నాడు.

మూడేళ్లుగా బెట్టింగ్కు బానిసగా మారి స్నేహితులు, పరిచయస్తుల దగ్గర దాదాపు రూ.10 లక్షలు అప్పు చేశారు వంశీ. కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకొని మందలించడంతో, మనస్తాపానికి గురై పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు వంశీ. ఇక ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి అయిన తరుణంలో కేసు నమోదు చేసుకుని… దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.