ఫోన్ మాట్లాడొద్దని మందలించడంతో ఇద్దరు యువతుల ఆత్మహత్య

-

ఫోన్ మాట్లాడొద్దని మందలించడంతో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఒక యువతి, అన్నమయ్య జిల్లాలో మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఫోన్ మాట్లాడడం ఎక్కువైందని, తగ్గించుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు యువతులు. హైదరాబాద్ – పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న రాజేష్ కుమార్ కుమార్తె తేజస్విని (19), గౌతమి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది.

ఈ నెల 8వ తేదీ ఆదివారం రాత్రి 11 గంటలకు తేజస్విని ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నావు తగ్గించాలని మందలించారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులు మందలించారని ఆవేదనతో, సోమవారం ఉదయం వారు డ్యూటీకి వెళ్ళాక చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది తేజస్విని. అన్నమయ్య జిల్లా మదనపల్లకి చెందిన గఫూర్, హసీనా దంపతుల కుమార్తె మస్తానీ (16) ఎనిమదవ తరగతి వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటుంది. పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి, మస్తానీ ఫోన్ మాట్లాడుతుండడంతో మందలించింది తల్లి హసీనా. దీంతో మనస్తాపానికి గురయ్యి, తను వేసుకున్న చున్నీతో బాత్ రూమ్ లో ఆత్మహత్య చేసుకుంది యువతి.

 

Read more RELATED
Recommended to you

Latest news