ప్రమాదవశాత్తు రైలు కింద పడబోయిన ప్రయాణికురాలిని కాపాడిన కానిస్టేబుల్

-

కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించడం.. లేదా కదులుతున్న రైలు నుంచి దిగడానికి ప్రయత్నించడం.. రైలు వచ్చినప్పుడు ప్లాట్​ఫామ్ మీద కాకుండా.. ట్రాక్​కు దగ్గరగా ఉండటం.. ఇలా రకరకాలుగా ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రయాణికులు. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు.. ఇది గమనించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా వరకు కేసుల్లో క్షణాల వ్యవధిలో.. పోలీసుల సమయస్ఫూర్తితో ప్రయాణికుల ప్రాణాలు దక్కుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే వరంగల్ రైల్వే స్టేషన్​లో చోటుచేసుకుంది.

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు రైలు కింద పడుతుండగా… ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్‌ చాకచక్యంగా కాపాడారు. భద్రాచలం రోడ్డు నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ శనివారం తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు వరంగల్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆగుతున్న సమయంలో ఓ మహిళా ప్రయాణికురాలు దిగేందుకు ప్రయత్నించారు. పట్టు జారి ప్లాట్‌ఫాం మీద పడిపోయారు. తలుపు వద్ద హ్యాండిల్‌ను వదలక పోవటంతో… కొద్ది దూరం రైలు ఆమెను ఈడ్చుకొని వెళ్లింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుల్‌ సొనాలి పరుగున వచ్చి ప్రయాణికురాలిని ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాం వైపు లాగారు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version