దర్మపురి అర్వింద్‌కు వై కేటగిరీ భద్రత !

-

నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కు ప్రభుత్వం భద్రత కల్పించింది. ఈటెల రాజేందర్ తరహాలోనే ధర్మపురి అరవింద్ కు వై కేటగిరి భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజుల కిందట హుజరాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వైప్లస్ కేటగిరి భద్రత కల్పించిన ప్రభుత్వం… ఇక ఇప్పుడు ధర్మపురి అరవింద్ కు వై కేటగిరి భద్రత కల్పిస్తున్నారు.

ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ప్రభుత్వం. కాగా… గత వారం రోజుల కిందట… తన భర్త ఈటల రాజేందర్ కు ప్రాణహాని ఉందని… ఈటెల జమున మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జమున చేసిన కామెంట్లను నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్ కు వైప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version