మండుతున్న ఎండలు..తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..!

-

ఎండలు..మండుతున్న నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ప్రజలకు అలర్ట్‌ ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు.. క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సగటున 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు.

Yellow alert issued to many districts on April 1 and 2

ఏప్రిల్ మొదటి వారం నుంచి మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ..పేర్కొంది. తెలంగాణ రాష్టంలో వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఏప్రిల్ 1,2 తేదీలలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది ఐఎండీ. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.

Read more RELATED
Recommended to you

Latest news