ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా ఆయన ఎన్ఐఏ అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాసేపటి క్రితమే తెలుగు యూట్యూబ్ భయ్యా సన్నీ యాదవ్ ను ఎమ్మెల్యే అదుపులోకి తీసుకుంది. చెన్నై విమానశ్రయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్తాన్ లో బైక్ టూర్ పూర్తి చేశారు భయ్యా సన్నీ యాదవ్.

ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. మొన్న జ్యోతి మల్హోత్రా లాంటి వారు.. ఇండియాలోనే ఉంటూ పాకిస్తాన్ కు గూఢచార్యం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. దీంతో అతన్ని NIA అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.