Goods will be available in ration shops: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఇంటింటికీ రేషన్ పేరుతో గత వైసీపీ ప్రభుత్వం మాయ చేసిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రైస్ స్మగ్లింగ్ అనేది లేకుండా ఇకపై రేషన్ షాపుల్లోనే నిత్యావసరాల పంపిణి కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లోనే సరుకులు ఇస్తామని ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇకపై పనులు మానుకుని వ్యాన్ కోసం ఎదురు చూడాల్సి అవసరం లేదని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్.