సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండలు విపరీతంగా కొడుతుంటాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ ఏడాది కాస్త ఎక్కువగానే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్, మే నెల వచ్చే సరికి 44 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
1901 నుంచి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సైతం సాధారనం కంటే రెండు డిగ్రీలు పెరిగే సూచనలున్నాయని తెలిపింది. 125 సంవత్సరాల సరాసరి సగటు తీసుకుంటే గాలిలో తేమ చాలా తగ్గిందని పేర్కొంది.