హరికృష్ణ తీరని కోరిక అదేనట.. ఎన్టీఆర్ అయినా తీరుస్తాడా..?

-

ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ అటు సినిమాలలో, ఇటు రాజకీయాలలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2018 ఆగస్టు 29వ తేదీన హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించి సినీ ఇండస్ట్రీకి శోకసంద్రాన్ని మిగిల్చారు. ఇకపోతే ఎన్టీఆర్ వారసుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిత్వం కలవాడు. కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 2న హరికృష్ణ 66వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మరోసారి నందమూరి ఫ్యామిలీ అలాగే అభిమానులు హరికృష్ణను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.

అంతేకాదు హరికృష్ణ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు . ఇక హరికృష్ణ తన కుమారుల విషయంలో తీరని కోరిక తోనే మరణించారని చెబుతూ ఉంటారు. నిజానికి హరికృష్ణకు ముగ్గురు కుమారులు సంతానం. జానకిరామ్ , కళ్యాణ్ రామ్ మొదటి భార్య సంతానం కాగా.. ఎన్టీఆర్ రెండవ భార్య సంతానం. ఇక జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీతో కాస్త అనుబంధం తక్కువే ఉన్నా.. ఇప్పుడు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఎంతో అన్యోన్యంగా కొనసాగుతున్నారు. తన సోదరుడి సినిమాలను తారక్ దగ్గరుండి చూసుకుంటూ ఉండడం ఇటీవల విడుదలైన బింబిసార చిత్రమే అందుకు మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.

ఇకపోతే హరికృష్ణ చివరి కోరిక ఏమిటంటే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ కలిసి ఒక చిత్రంలో నటించాలని, ఆ సినిమాలో తాను కూడా ఉండాలని హరికృష్ణ కోరుకున్నారట. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. హరికృష్ణ తీరని కోరికపై అభిమానులు ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. కనీసం బింబిసార 2 సినిమాతో నైనా వీరిద్దరూ కలిసి నటిస్తారేమో చూడాలి. ఇక అలా చేయగలిగితే ఎన్టీఆర్ తన తండ్రి కోరికను తీర్చినట్లు అవుతుందని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version