రోజా కంటే నాగబాబుకు తక్కువ పారితోషకం ఇవ్వడానికి కారణం అదే..ఏడుకొండలు..!!

-

జబర్దస్త్.. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ షోలలో జబర్దస్త్ మొదటి స్థానంలో ఉంటుంది అనడం లో సందేహం లేదు. 2013లో ధనరాజ్, వేణు వంటి కమెడియన్లతో రోజా, నాగబాబు జడ్జిలుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇక ఇందులో అనసూయను యాంకర్ గా తీసుకున్నారు. ఇక నిర్విరామంగా 9 సంవత్సరాల పాటు మంచి టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోయిన ఈ జబర్దస్త్ వేదిక ఎంతోమందికి మంచి జీవితాన్ని అందించింది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతున్న సుధీర్, ఆది , అభి, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి వారికి అవకాశం ఇచ్చి ఉన్నత స్థానానికి చేర్చితే ఇప్పుడు వారు డబ్బుకు కక్కుర్తి పడి జబర్దస్త్ ను వదిలి వెళ్లడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

నిజానికి ఈ షో నుంచి ఇలా ఒక్కొక్కరుగా వెళ్లిపోవడానికి కారణం మెగా బ్రదర్ నాగబాబు అని జబర్దస్త్ షో మేనేజర్ ఏడుకొండలు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు సంచలన విషయాలను వెల్లడించారు. సహ జడ్జ్ రోజా కంటే నాగబాబుకు తక్కువ పారితోషకం ఇవ్వడంతో ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక మల్లెమాల యూనిట్ తో గొడవపడి మరి జబర్దస్త్ షో ని వదిలి వెళ్ళినట్లు గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఇదే విషయంపై.. నాగబాబు – రోజాల మధ్య పారితోషకం విషయంలో ఉన్న తేడాలను కూడా ఏడుకొండలు ఇంటర్వ్యూలో వెల్లడించడం జరిగింది.

ఇక అసలు విషయం ఏమిటంటే రోజా అప్పటికే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకొని.. రాజకీయపరంగా కూడా ఆమె బాగా పాపులారిటీని సంపాదించుకుంది. అలాంటి ఆమెను ఈ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి ఎక్కువ పారితోషకం ఇవ్వాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఇక నాగబాబు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేశారు. కాబట్టి ఆయనకు ఇండస్ట్రీలో పెద్దగా డిమాండ్ లేని కారణంగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఇచ్చే పారితోషకాన్ని నాగబాబుకు ఇచ్చినట్టు ఏడుకొండలు తెలిపారు. ప్రస్తుతం ఏడుకొండలు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version