తల్లి మందలించిందని కుంటలో దూకి కూతురి ఆత్మహత్య

-

కామారెడ్డి జిల్లా లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తల్లి మందలించడంతో కూతురు కుంటలో దూకి ఆత్మహత్య కు పాల్పడింది. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మేఘమాల (17) అనే యువతి తల్లి మందలించడంతో కుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తరచూ మొబైల్ ఫోన్ ను చూస్తుందని కూతురును మందలించింది తల్లి.

అయితే తీవ్ర మనస్థాపానికి గురైన మేఘమాల తల్లి మందలించడంతో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. మేఘమాల శనివారంగ్రామ శివారులోని పరికంప కుంటలో శవమై తేలింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు దోమకొండ పోలీసులు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version