లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్‌డెడ్!

-

కర్నూల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగర సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం యాక్సిడెంట్ సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రోడ్డు ప్రమాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గానికి చెందిన గణేశ్, రుద్ర, సోమశేఖర్.. కర్నూలుకు చెందిన గోపి, రాజు, జాఫర్ అనంతపురం(ఏపీ)కు బయల్దేరారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుపై వీరు వెళ్తున్న వాహనం ముందుగా వెళ్తున్న లారీని ఢీకొంది. దీంతో రుద్ర, సోమశేఖర్, గణేశ్ స్పాట్‌లో చనిపోయారు.

ఈ క్రమంలో గోపి, జాఫర్, రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version