బుల్లెట్ ప్రూప్ ట్రాక్టర్ తయారు చేసిన రైతు.. ఎందుకంటే..?

-

కృషి పట్టుదల ఉంటె మనిషి ఏదైనా సాధించగలడు అని మరోసారి నిరూపించాడు ఓ వ్యక్తి. తన ఆత్మరక్షణ కోసం టెక్నాలజీని వాడుకొని సరికొత్త వాహనాన్ని సృష్టించాడు. అయితే అతడు ఆ వాహనాన్ని ఎందుకు తాయారు చేశాడో.. అసలు ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందామా.

tractor
tractor

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానా, ఉత్తర్​ప్రదేశ్​ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో ఈ రైతు నివసిస్తాడు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాల కారణంగా ఘర్షణలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆ రైతు కొత్తగా ఆలోచించాడు. తన ట్రాక్టర్​ను బుల్లెట్​ ప్రూఫ్​గా మార్చాశాడు. ఉత్తర్​ప్రదేశ్​, హర్యానా మధ్య ఎప్పటి నుంచో జలవివాదం కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశారనని రైతు రాజేంద్ర చెప్పాడు.

అయితే ఈ సమస్య నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ట్రాక్టర్​ను బుల్లెట్​ ప్రూఫ్ చేయించాను. ఇప్పుడు మా ప్రాంతంలోని రైతులు ఇదే విధానాన్ని అనుసరించాలని భావిస్తుున్నారని సదరు రైతు వెల్లడించాడు. గత వారం నేను నా సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపారు.

ఇక ఆ సమయంలో ఈ ట్రాక్టర్​ కారణంగా మేము సురక్షితంగా బయటపడ్డామని సదరు రైతు చెప్పాడు. ఏది.. ఏమైనా ఈ ఆలోచన కాస్త వినూత్నమైనదో అయినా.. ఖర్చుతో కూడుకుంది కూడా. పెద్ద, పెద్ద రైతులు భరించగలరు కానీ.. చిన్న, సన్నకారు, కౌలు రైతులు మాత్రం ఈ విధానాన్ని అనుసరించడం కష్టం. ఈ మోడల్ చేయించడానికి రూ. 5 లక్షల ఖర్చు అయ్యిందట. ఆత్మ రక్షణ కోసమే ఈ ట్రాక్టర్​ను బుల్లెట్​ ప్రూఫ్​ చేశానని చెబుతున్నాడు 38 ఏళ్ల రాజేంద్ర. ఇక ఈ వాహనాన్ని చూసిన వారంతా ఔరా అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news