మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే : చంద్రబాబు నాయుడు

-

తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో గెలుపు ఎన్డీయేదే.. కూటమికి మోడీ అండ ఉంది అని అన్నారుచిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల సభ సందర్భంగా… చంద్రబాబు నాయుడు ….మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలి.. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటే.. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా.. అని తెలిపారు.ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ.. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం.. ఎన్నో పథకాలతో ప్రధాని మోడీ సంక్షేమం అందించారు అని పేర్కొన్నారు.

 

మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటివి చేస్తున్నారు అని ప్రశంసల వర్షం కురిపించారు.. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే లక్ష్యంతో మోడీ పని చేస్తున్నారు..ప్రపంచంలో భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా మార్చారు అని చంద్రబాబు నాయుడు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version