కృష్ణానదికి పోటెత్తిన వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత!

-

భారీవర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తింది.అంతకంతకూ ప్రవాహం పెరుగుతుండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి 2.06 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ టైంలో ఎవరూ నదిని దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.

వరద ఉధృతి నేపథ్యంలో మురుగునీటి కాల్వలు, కల్వర్టులకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరూ విద్యుద్ఘాతానికి గురికాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై ఓపెన్ మ్యాన్ హోల్స్ కనిపిస్తే అక్కడ ఎర్రటి జెండాలు లేదా బారికేడ్లను పెట్టాలని సూచించారు. వరదనీటిలో వాహనాలను నడిపే సాహసాలు చేయొద్దని హెచ్చరించారు. వరదల కారణంగా ఇళ్లు మునిగి ఖాళీ చేయవలసి వస్తే విలువైన వస్తువుల్ని వెంటబెట్టుకోవాలన్నారు. వరదలు తగ్గుముఖం పట్టాక ఇంటి పరిసరాల్లో క్రిమిసంహారక మందులు, బ్లీచింగ్ చల్లడం మరిచిపోవద్దన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news